హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో పేకాట స్థావరంపై పోలీసులు రెయిడ్ చేశారు. నగర శివారులోని ఒక విల్లాలో చేరిన కొందరు భారీ ఎత్తున పేకాట ఆడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ విల్లాపై దాడి చేశారు. నార్సింగి పరిధి మంచిరేవులలో ఉన్న ఈ విల్లాపై ఎస్వోటీ పోలీసులు రెయిడ్ చేశారు.
ఇక్కడ పేకాట ఆడుతున్న 30 మందిని అదుపులోకి తీసుకున్నారు. అదే ఫామ్హౌస్లో రూ.6.70 లక్షల నగదు, 34 మొబైల్ ఫోన్లు, కేసినో కాయిన్లు, కార్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.