సిటీబ్యూరో, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): సమస్యలుంటే గ్రీవెన్స్ సెల్ దృష్టికి తేవాలని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సిబ్బందికి సూచించారు. గ్రీవెన్స్ సెల్ పనితీరుపై శుక్రవారం డీసీపీలు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ గత వారం గ్రీవెన్స్ సెల్కు వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సంతృప్తి వ్యక్తం చేశారు. టీఎస్ జీఎల్ఐ బాండ్లు అర్హత ఉన్న సిబ్బందికి అందించేలా సెక్షన్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బాలానగర్, అల్వాల్, శామీర్పేట్, మైలార్దేవ్పల్లి, షాద్నగర్ తదితర పోలీస్స్టేసన్లలో బ్యారక్, రెస్ట్ రూమ్లు, ఇతర మౌలిక వసతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించనున్నట్లు తెలిపారు.
నిర్మాణంలో ఉన్న కేశంపేట్, నార్సింగి పోలీస్స్టేషన్ల ప్రారంభంతో పాటు భరోసా సెంటర్ భవన నిర్మాణంపై అధికారులతో సీపీ చర్చించారు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటూ.. సిని మా షూటింగ్లకు అనుమతులు ఇచ్చేందుకు సైబరాబాద్లో లైజనింగ్ అధికారిని నియమిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో డీసీపీలు ప్రకాశ్రెడ్డి, విజయ్కుమార్, పద్మజ, వెంకటేశ్వర్లు, అదనపు డీసీపీ ఎండీ రియాజ్ ఉల్ హక్, ఏసీపీ మట్టయ్య, చీఫ్ అకౌంట్స్ అధికారి చంద్రకళ, చీఫ్ అడ్మిషన్ అఫీసర్ తదితరులు పాల్గొన్నారు.