హైదరాబాద్: కొందరు డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్లలో వీడియోలు చూస్తుంటారు. మరికొందరు ఇయర్ఫోన్స్ పెట్టుకుని అదేపనిగా మాట్లాడుతూ ఇతర వాహనాలను పట్టించుకోరు. ఇలాంటి వారికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (CP Sajjanar) వార్నింగ్ ఇచ్చారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో వీడియోలు చూడటం, ఇయర్ఫోన్స్ వినియోగించడం వంటి చర్యలు ప్రమాదకరమైనవే కాకుండా శిక్షార్హమైనవని, ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆటో రిక్షా, క్యాబ్, బైక్ టాక్సీలను నడుపుతున్న డ్రైవర్లు ఇలా చేస్తూ తరచుగా కనిపిస్తున్నారని చెప్పారు. వాహనాన్ని నడుపుతున్న సమయంలో ఫోన్ వాడటం వల్ల వారి దృష్టి రోడ్డుపై ఉండదని, ఇది ప్రాణాంతక ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి నిర్లక్ష్య చర్యలపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. డ్రైవర్, ప్రయాణికులు, రోడ్డుపై ప్రయాణించే వారి భద్రత అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. ఏ పరధ్యానం కూడా ప్రాణానికి విలువైనపెద్దది కాదని, ప్రతి ఒక్కరూ రోడ్డుపై భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. క్షణిక అవసరాల కోసం ప్రాణాలు పొగొట్టుకోవద్దని ఎక్స్ వేదికగా సూచించారు.
🚦 Many drivers, including auto-rickshaw and cab/bike taxi drivers, are often seen watching videos or using earphones while driving. This is dangerous and a punishable offence. Hyderabad Traffic Police will take strict action against such violators.
Safety of self, passengers,… pic.twitter.com/n87ZCbu3Ip
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) October 7, 2025