సిటీబ్యూరో, అక్టోబరు 25(నమస్తే తెలంగాణ): సివిల్స్-2020 లో 207వ ర్యాంకు సాధించిన మలక్పేటకు చెందిన సంజన, 560వ ర్యాంకుతో సివిల్స్లో ఉత్తీర్ణత పొందిన మహబూబ్నగర్ జిల్లా వాసి దివ్యశ్రీ సోమవారం రాచకొండ కమిషనర్ మహేశ్భగవత్ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సీపీ వారిని సత్కరించి జ్ఞాపికలను అందించారు.