సిటీబ్యూరో, జనవరి 4 (నమస్తే తెలంగాణ): సిటీలో నేర ప్రవర్తన కల్గిన వాళ్లు తమ మైండ్సెట్ను మార్చుకొని సత్ప్రవర్తనతో నడుచుకోవాలని పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు. గురువారం అదనపు జిల్లా మేజిస్ట్రేట్(ఎగ్టిక్యూటివ్) హోదాలో నగర పోలీస్ కమిషనరేట్లో కోర్టును నిర్వహించారు. కాలపత్తార్ పోలీస్ స్టేషన్కు చెందిన 12 మంది వివిధ కేసుల్లోని నేరస్తులకు, బంజారాహిల్స్ ఠాణా పరిధికి చెందిన మరో ఆరుగురికి కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఇందులో కొందరు హత్యలు, నేరాలు చేసిన వాళ్లున్నారు. వీరిపై హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కేసులున్నాయి. ప్రశాంతతకు భంగం కల్గిస్తే కఠిన చర్యలుంటాయని ప్రశాంతతతో పాటు సత్ప్రవర్తన కల్గిన వాళ్లుగా ఉండాలన్నారు. కనీసం సంవత్సరం పాటు మంచిప్రవర్తన కల్గిన వాళ్లుగా ఉంటే అదే అలవాటు అవుతుందన్నారు. ఈ మేరకు వారికి నుంచి ష్యూరిటీతో కూడిన సెక్యూరిటీ బాండ్లను జారీ చేశారు.