Hyderabad | సిటీబ్యూరో, మార్చి 21 (నమస్తే తెలంగాణ): లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నగరంలో 144 సెక్షన్ను విధిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా లైసెన్స్ ఆయుధాలు తీసుకెళ్లడం, కొత్త లైసెన్స్ జారీ చేయడం, ఎన్నికల్లో అభ్యర్థులకు మద్దతుగా ఆయుధాలను చూపించడం వంటి వాటిపై నిషేధం విధిస్తునట్లు తెలిపారు. ఆయుధ లైసెన్స్ దారులు లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలను పాటించాలని నగర పోలీస్ కమిషనర్ తెలిపారు.
నగరంలో శాంతి, సమరస్యాలను కాపాడటంలో భాగంగా అన్ని అంశాలను స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుందన్నారు. నిబంధనల మేరకు ఆయుధాలను డిపాజిట్ చేయాలని సూచించారు. తిరిగి ఆ ఆయుధాలను జూన్ 6వ తేదీ తరువాతే తీసుకోవాలన్నారు. స్క్రీనింగ్ కమిటీ ఆదేశాలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.