సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : నూతన సంవత్సర వేడుకలను అప్రమత్తతో, జాగ్రత్తతో, అవగాహనతో బాధ్యతాయుతంగా జరుపుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సూచించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మధ్యరాత్రి ఒంటి గంట వరకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ఆయా ఈవెంట్ల నిర్వాహకులకు, హాజరయ్యే వినియోగదారులకు ఆయన సూచించారు.