హైదరాబాద్: నగరంలోని రాంగోపాల్పేట ఇన్స్పెక్టర్పై వేటు పడింది. ఇన్స్పెక్టర్ సైదులును కమిషన్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సీపీ సీవీ ఆనంద్ (CV Anand)ఆదేశాలు జారీ చేశారు. విధినిర్వహణలో సీఐ సైదులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అక్రమకంగా నడుస్తున్న పబ్లపై నిర్లక్ష్యం వహించారిని, అర్ధరాత్రి వరకు పబ్బులు తెరిచి ఉంచినా పట్టించుకోకపోవడంతో సీపీ ఆయనపై చర్యలు తీసుకున్నారు.
రామ్గోపాల్పేట్లో అనుమతులు లేకుండా నడుస్తున్న తకీల పబ్పై టాస్క్ఫోర్స్ పోలీసులు రైడ్ నిర్వహించారు. అర్ధరాత్రి దాటినప్పటికీ పబ్ను నడుపుతున్నట్లు గుర్తించారు. పబ్ నిర్వహాకులతోపాటు 18 మందిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారం సీరియస్ అయిన సీపీ.. ఇన్స్పెక్టర్ను కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేశారు. సీఐ సైదులు స్థానంలో రాంగోపాల్పేట్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ను ఇంచార్జిగా ఎస్హెచ్ఓగా నియమించారు.