సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రానున్న లోక్సభ ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గురువారం కమిషనరేట్లో అన్ని జోన్ల డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, పోలీస్ నోడల్ అధికారులు, ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.