ఒకరికి 112, మరో ఇద్దరికి 37 రోజుల శిక్ష
సిటీబ్యూరో, మే 26(నమస్తే తెలంగాణ): పెట్టీ కేసుల్లో కూడా ఇప్పుడు జైలు శిక్షలు పడుతున్నాయి. చిన్న చిన్న గొడవలను ఆదిలోనే అరికట్టేందుకు నగర పోలీసులు పెట్టీ కేసుల్లోని అభియోగాలకు ఆధారాలను పకడ్బందీగా సేకరించి కోర్టుకు సమర్పిస్తున్నారు. నిందితులకు జైలు శిక్షలు పడుతున్నాయి.
కార్ఖానా పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి మద్యం మత్తులో స్థానికంగా నిత్యం భయాందోళనలు సృష్టిస్తున్నాడు. విచారణలో అతడిపై నమోదైన పెట్టీ కేసులు రుజువు కావడంతో సికింద్రాబాద్ కోర్టు 112 రోజుల జైలు శిక్షను విధించింది. తాజాగా, గాంధీనగర్ పీఎస్లో నమోదైన ఓ పెట్టీ కేసులో సికింద్రాబాద్ కోర్టు కె.భరత్(29)కు 112 రోజుల జైలు శిక్షను విధించింది. మణికంఠకు 37 రోజులు, భువనేశ్వర్ 18 రోజుల జైలు శిక్ష విధించింది.