అడ్డగుట్ట, ఏప్రిల్ 19 : భార్యను వేధించిన భర్తకు కోర్టు 210 రోజులు జైలు శిక్షను విధించింది. ఈ సంఘటన తుకారాంగేట్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ ఎల్లప్ప కథనం ప్రకారం… అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన రాజేశ్, అంభిక భార్యాభర్తలు. అయితే భర్త రాజేశ్ తరుచుగా మద్యం సేవించి వచ్చి భార్యను వేధించేవాడు.
ఈ నెల 13వ తేదీన పీకలదాకా మద్యం సేవించి వచ్చి భార్య, కూతురుపై దాడికి దిగాడు. దీంతో అతడి వేధింపులను తాళలేని భార్య తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త రాజేశ్ను బుధవారం సికింద్రాబాద్లోని 15వ స్పెషల్ ఎంఎం మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా అతడికి 210 రోజులు జైలు శిక్ష, రూ.1100 జరిమానా విధించింది.