హైదరాబాద్: నగర శివార్లలోని వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పనామా చౌరస్తాలో ఓ బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రమాదానికి గురైన, కారణమైన వాహనాలను రోడ్డుపైనుంచి పక్కకు తరలించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.