రామంతాపూర్, మే 29 : రాబోయే వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అన్ని డివిజన్లలో ఫాగింగ్, స్ప్రే కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిన అధికారులు మొదటగా రామంతాపూర్ డివిజన్లో గురువారం ఆధునిక పరికరాలు ఎనిమిది చిన్న మిషన్లు, రెండు పెద్ద మిషన్లతో కూడిన ఫాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని కార్పొరేటర్ బండారు శ్రీవాణి గురువారం ప్రారంభించారు. సీజనల్ వ్యాధుల వల్ల వ్యాపించే వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలుగా ఫాగింగ్ చేపట్టామన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ ఎస్ ఈ మాధవ రెడ్డి, ఏఈ నరేష్ రెడ్డి, సూపర్వైజర్ మహేందర్, యువమోర్చ నాయకులు మసిరెడ్డి ప్రభాకర్, ఎంటమాలజీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.