బండ్లగూడ,జూన్ 23: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం రూ. 4కోట్లతో భవానీనగర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం, రూ. 75లక్షలతో హైదర్షాకోట్ ప్రధాన రహదారి నిర్మాణం , రూ. 3 లక్షలతో సాయి హర్షకాలనీలో క్రీడా ప్రాంగణం, రూ. 50లక్షలతో ఎల్వీ ప్రసాద్ కంటి దవాఖాన వద్ద బీటీ రోడ్డు నిర్మాణం, రూ. 50 లక్షలతో విద్యుత్ దీపాల ఏర్పాటుకు మేయర్ మహేందర్గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్రెడ్డి, కార్పొరేటర్లతో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా బండ్లగూడలో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. అన్ని డివిజన్లలో సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించి త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, సాగర్గౌడ్, బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్గౌడ్, నాయకులు రావుల కోళ్ల నాగరాజు, పాపయ్య యాదవ్, మాలాకీరత్నం, నరేశ్, రాజు, నర్సింగ్రావు, సుమన్గౌడ్, నదీం, జ్ఞానేశ్వర్, దశరథ్, కుమార్యాదవ్, రాజేశ్, బాబు, సదానంద్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మున్సిపాలిటీ అభివృద్ధే ధ్యేయం..
శంషాబాద్ రూరల్, జూన్ 23 : శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. గురువారం శంషాబాద్ పట్టణంలో సమీకృత మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమీకృత మార్కెట్ నిర్మాణానికి రూ. 4.50 లక్షలు కేటాయించామన్నారు. త్వరలో పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. కార్యక్రమంలో చైర్పర్సన్ సుష్మ, వైస్ చైర్మన్ బండిగోపాల్యాదవ్, కౌన్సిలర్లు మేకల వెంకటేశ్, రాచమల్ల సంగీత,అమృతారెడ్డి, కొండ ప్రవీణ్గౌడ్, మండల అధ్యక్షుడు చంద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, కమిషనర్ సాబేర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
25 వ వార్డులో కార్యాలయం ప్రారంభం
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో కౌన్సిలర్ పుష్పలతారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ప్రారంభించారు. నాయకులు బుచ్చిరెడ్డి, కొనమల్ల శ్రీనివాస్, భార్గవ్రెడ్డి, నరేందర్గౌడ్ పాల్గొన్నారు.