గ్రేటర్ వ్యాప్తంగా కరోనా తీవ్రరూపం దాల్చుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఓ వైపు నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచుతూనే, అర్హులందరికీ టీకాలు వేస్తున్నది. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు కేంద్రాల వద్ద పరీక్షల కోసం బారులు తీరుతున్నారు. టీకా కేంద్రాల వద్ద రద్దీ రోజురోజుకూ అధికమవుతున్నది. రాత్రి కర్ఫ్యూను విధిగా పాటిస్తున్న జనం 9 గంటలకల్లా ఇండ్లకు చేరిపోతున్నారు. అయితే ప్రభుత్వం, వైద్య నిపుణులు ఎంత చెబుతున్నా కొందరిలో మార్పు రావడం లేదు. మాస్క్ లేకుండా ఇష్టానుసారం తిరుగుతూ ముప్పు కొనితెచ్చుకుంటున్నారు. షాపింగ్ మాల్స్, వారాంతపు సంతలు, మార్కెట్లలో భౌతికదూరం పాటించకపోవడంతో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఆంక్షలు లేకపోవడంతో విందులు, వినోదాల్లో పాల్గొంటూ కరోనా బారినపడుతున్నారు. ఈనెల 16వ తేదీన 598 పాజిటివ్ కేసులు నమోదైతే.. వారం రోజుల్లోనే 1464 కేసులకు పెరగడం తీవ్రతకు నిదర్శనం.
గ్రేటర్వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ బీభత్సం సృష్టిస్తోంది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరమని ప్రభుత్వం, వైద్య నిపుణులు ఎంత చెబుతున్నా ప్రజలు బేఖాతర్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే దాదాపు వైరస్కు చెక్ పెట్టినట్టేనని చెబుతున్నారు. ఈనెల 16వతేదీన గ్రేటర్ పరిధిలో 598 కేసులు నమోదైతే. వారం రోజుల్లోనే అంటే ఈనెల 23న 1464 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.
కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఒకరికి పాజిటివ్ వస్తే ఆ కుటుంబంలో అం దరూ కొవిడ్ బారిన పడుతున్నారు. కనీస జాగ్రత్తలు పాటిస్తూ వైరస్ నివారణకు అందరూ సహకరించాలి. ప్రతిఒక్కరూ మాస్క్లు ధరించడంతోపాటు అర్హులంతా టీకా తప్పనిసరిగా వేయించుకోవాలి. -డాక్టర్ జమీల్ అహ్మద్, ఆయుర్వేద వైద్యుడు