మేడ్చల్, ఫిబ్రవరి 3: తెలంగాణలోనే జవహర్నగర్ కార్పొరేషన్ను మోడల్సిటీగా మారుస్తానని మేయర్ మేకల కావ్య అన్నారు. శుక్రవారం కార్పొరేషన్లోని 15వ డివిజన్ శాంతినగర్, ఆనందర్నగర్ కాలనీలో మేయర్ పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్పొరేషన్ అంతటా భూగర్భ డ్రైనేజీ, సీసీ రోడ్ల పనులు పూర్తికావచ్చాయని, సమస్యలు లేని జవహర్నగర్గా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని అన్నారు.
మంత్రి మల్లారెడ్డి సహకారంతో కార్పొరేషన్ రూపురేఖలు మారిపోయాయని, జవహర్నగర్ను మరింత అభివృద్ధి చేసి ప్రగతి పథంలో నడిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నాగభూషణం, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు భార్గవ్రామ్, మహిళా నాయకురాలు స్వప్న, మైనార్టీ నాయకులు మథిన్, కాలనీవాసులు పాల్గొన్నారు.