చిక్కడపల్లి : దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.గాంధీనగర్ డివిజన్లోని సిద్దంశెట్టి టవర్ అపార్ట్ మెంట్ ప్రాంగణంలో ఉన్న బంగారు పోచమ్మ దేవాలయం పునర్నిర్మాణ పనులను శుక్రవారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆద్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు.నియోజకవర్గంలో అనేక దేవాలయాల అభివృద్ధికి సహాయం అందించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ముఠా పద్మానరేశ్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర నాయకుడు ముఠా జయసింహ, దేవాలయం ట్రస్ట్ కమిటీ చైర్మన్ జి.ఎస్.ఎన్.రాజు,కన్వీనర్ ముఠా నరేశ్ తదితరులు పాల్గొన్నారు.