కాచిగూడ : తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న లక్ష 50 వేల కాంట్రాక్ట్(Contract), ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను (Outsourcing Employees) పర్మినెంట్ చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య( R. Krishnaiah) డిమాండ్ చేశారు. జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ఆదివారం ధర్నా చేపట్టారు.
కృష్ణయ్య మాట్లాడుతూ తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, పంజాబ్, రాజస్థాన్(Rajasthan) రాష్ట్రాల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేశారని గుర్తు చేశారు. తెలంగాణలోని విద్యా, వైద్య, ఆరోగ్యశాఖ, వ్యవసాయం, దేవాదాయశాఖ, మున్సిపాల్ కార్పొరేషన్లు, బీసీ,ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్కుమార్,నీల వెంకటేశ్, రమేశ్,సుధాకర్,నందగోపాల్, రామ్మోహన్,వెంకటేశ్,ఉదయ్, జ్యోతి, వాణి, తదితరులు పాల్గొన్నారు.