హైదరాబాద్ : పేదల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలానే లక్ష్యంతో ప్రభుత్వం మల్టీ పర్ఫస్ ఫంక్షన్ హాల్స్ను నిర్మించి అతి తక్కువ అద్దెకు అందుబాటులోకి తీసుకొస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని తన నివాసం వద్ద బేగంపేట డివిజన్కు చెందిన ముఖ్య నాయకులతో ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈ నెల 26 వ తేదీన సాయంత్రం 6.30 గంటలకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బేగంపేటలోని పాటిగడ్డలో 6 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మల్డీ పర్ఫస్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభిస్తారని చెప్పారు. పేద, మద్య తరగతి ప్రజల మేలు కోసమే G + 2 విధానంలో ఈ మల్టీ పర్ఫస్ ఫంక్షన్ హాల్ను నిర్మించినట్లు ఆయన తెలిపారు.
పేద, మద్య తరగతి ప్రజలు ఫంక్షన్నల నిర్వహణ కోసం ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్కు లక్షల రూపాయల అద్దెలను చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఫంక్షన్ హాల్లో అవసరమైన వంట పాత్రలు, కుర్చీలు ఇతర సామగ్రిని కూడా సమకూరుస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మంత్రి కేటీఆర్కు ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ టి.మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ ఉప్పల తరుణి, డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, నాయకులు నరేందర్ రావు, శ్రీహరి, శేఖర్, ఆరీఫ్, అక్బర్, అఖిల్, సలీం తదితరులు పాల్గొన్నారు.