గౌతంనగర్, మార్చి 28 : బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే కాలనీ, బస్తీలలో కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరా వు అన్నారు. బుధవారం గౌతంనగర్ డివిజన్, వాణీనగర్లో రూ.37లక్షలతో నిర్మించిన కమ్యూనిటీహాల్ను కార్పొరేటర్ మేకల సునీతారాముయాదవ్తో కలిసి ఆయ న ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం కమ్యూనిటీహాళ్లను నిర్మించి అసోసియేషన్ సంఘాలకు అందిస్తున్నదని అన్నారు. వాణీనగర్ కాలనీ సమావేశాలకు, మున్సిపల్ కార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా ఈ కమ్యూనిటీహాల్ను నిర్మించామని తెలిపారు. వెల్ఫేర్ అసోసియే షన్ ప్రతినిధులు కమ్యూనిటీహాల్ నిర్మించాలని కోరిన వెంటనే నిధులను మంజూరు చేయించి నిర్మించామని తెలిపారు.
గౌతంనగర్ డివిజన్కు 2కోట్లు మంజూరు..
గౌతంనగర్ డివిజన్లో నెలకొన్న సమస్యలు, రోడ్లు, డ్రైనేజీలను పరిష్కరించాలని కార్పొరేటర్ సునీతారాముయాదవ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావును కోరారు. తక్షణమే నార్త్జోన్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డికి ఎమ్మెల్యే ఫోన్ చేసి రోడ్లు, డ్రైనేజీ పరిస్థితిని వివరించగా వెంటనే రూ.2కోట్ల నిధులను మంజూరు చేశారు. సమస్యలు తన దృష్టికి తీసుకవచ్చిన వెంటనే సంబంధిత విభాగాలకు చెందిన అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రాజు, ఈఈ లక్ష్మణ్, డీఈ లౌక్య, ఏఈ దివ్యజ్యోతి, సీనియర్ నాయకులు మేకల రాముయాదవ్, వాణీనగర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.