సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): క్రీడాభివృద్ధికి జీహెచ్ఎంసీ పెద్దపీట వేస్తున్నది. ఆటలను ప్రోత్సహించేలా నూతన క్రీడా మైదానాలను అందుబాటులోకి తీసుకువస్తున్నది. తెలంగాణ క్రీడా ప్రాంగణం పథకంలో 450 క్రీడా మైదానాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా, ఇప్పటి వరకు 311 గుర్తించారు. త్వరలో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, లాంగ్జంప్ తదితరల క్రీడలకు ఈ మైదానాలను ఉపయోగించనున్నారు. జీహెచ్ఎంసీ క్రీడా విభాగం ఏడాది పొడవునా 521 క్రీడా మైదానాలు ఉండగా, సుమారు 1.50 లక్షల మంది ప్రతి నెలా వీటిని ఉపయోగిస్తున్నారు. సామాన్య ప్రజలు, క్రీడా సంఘాలు, పాఠశాలల విద్యార్థులు ఈ క్రీడా ప్రాంగణాల్ని జీహెచ్ఎంసీ ఆన్లైన్ పోర్టల్ www.ghmc.gov.in/sports ద్వారా బుక్ చేసుకుంటున్నారు.
క్రీడలకు జీహెచ్ఎంసీ పెద్దపీట
పిల్లలకు క్రీడలపై ఆసక్తి ఉన్నా ప్రోత్సాహం ఉండదు. తల్లిదండ్రులు ప్రోత్సహించినా అందుబాటులో మైదానాలు ఉండవు. ఆరోగ్యవంతమైన నగరాన్ని తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ
క్రీడలకు పెద్ద పీట వేస్తున్నది. క్రీడా మైదానాల అభివృద్ధి, వసతుల కల్పన, కొత్త మైదానాల ఏర్పాటు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ల నిర్మాణంతో పాటు సమ్మర్ కా్ంయపుల ద్వారా పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నాం.
అంతేకాకుండా వెటరన్ క్రీడాకారులకు నెలనెలా ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఈ క్రీడా స్థలాలను ప్రైవేట్ స్కూళ్లు కూడా ఉపయోగించుకునేలా జీహెచ్ఎంసీ వెసులుబాటు కల్పించింది.
– మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, డిప్యూటీ మేయర్