శేరిలింగంపల్లి :నియోజకవర్గ సమగ్రాభివృద్ధే తన లక్ష్యమని ప్రభుత్వవిప్,ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శుక్రవారం హఫీజ్పేట్ డివిజన్లో రూ. 5కోట్ల 9లక్షల వ్యయంతో చేపట్టబోయే అభివృద్ధి పనులకు కార్పొరేటర్లు పూజితగౌడ్, జగదీశ్వర్గౌడ్, కలిసి శంకస్ధాపనచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…కరోనావంటి విపత్కర పరిస్ధితుల్లోను అభివృద్ధి ఆగకూడదనే ఉద్ధేశ్యంతో రాష్ట్రప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తుందన్నారు.
పురపాలకశాఖామంత్రి కేటీఆర్ దిశానిర్దేశంలో నియోజవర్గంలోని అన్నిడివిజన్లలో మెరుగైన వసతుల కల్పనకు కృషిచేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. అభివృద్ధి పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గౌతంగౌడ్, వాలాహరీష్, వెంకటేశ్గౌడ్, లకా్ష్మారెడ్డి, దామోదర్రెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.