బంజారాహిల్స్,ఫిబ్రవరి 29: జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తలను కిడ్నాప్ చేసి.. దాడికి పాల్పడిన ఘటనలో బోరబండ కాంగ్రెస్ కార్పొరేటర్ బాబా ఫసీయద్దీన్ ప్రధాన అనుచరుడు చోర్ అబ్బూతో సహా ఐదుగురు నిందితులను జూబ్లీహల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు సయ్యద్ అక్బర్, సాయితేజపై చోర్ అబ్బూ శ్రీనాథ్, అవేజ్, అల్తాఫ్, చక్కా సాయి, శ్రీకాంత్లతో కలిసి కిడ్నాప్ చేసి..దాడికి పాల్పడ్డారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ..నిందితులను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నిందితుడు అవేజ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, చోర్ అబ్బూ, చక్కా సాయిపై గతంలో పలు పోలీస్స్టేషన్లలో క్రిమినల్ కేసులు ఉన్నట్లు విచారణలో తేలింది.