సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో మన బస్తీ-మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సమావేశ మందిరంలో మన బస్తీ-మన బడి కార్యక్రమానికి సంబంధించిన పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య, మౌలిక సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతోనే మన బస్తీ-మన బడి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఈవో ఆర్ రోహిణి, ఈఈలు, డిప్యూటీవోలు, ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.