చిక్కడపల్లి : గాంధీనగర్ డివిజన్లోని జవహర్నగర్ కమ్యూనిటీ హాల్ను అధికారులు ప్రజలకు ఇవ్వడం లేదని స్థానికు లు ఎమ్మెల్యే ముఠా గోపాల్కు ఫిర్యాదు చేశారు. హాల్ ను అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక బస్తీవాసులు శుక్రవారం ఎమ్మెల్యే కు వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా స్థానిక బస్తీ నాయకులుమాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలంగా కరోనా కారణంగా కమ్యూనిటీ హాల్ను ప్రజలకు శుభాకార్యాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదన్నారు.
ప్రస్తుతం కరోనా తగ్గినా కూడా అనుమతి ఇవ్వక పోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు వివరించారు. గాంధీనగర్, జవహర్నగర్ తదితర బస్తీల ప్రజలు చిన్నచిన్న కార్యాలు నిర్వహించుకునేందుకు వసతి సౌకర్యాలు లేకుండా పోయిందన్నారు. కొవిడ్ తగ్గినా ప్రజలకు కమ్యూనిటీ హాల్ను ఇవ్వకుండా అధికారులు వారి కార్యాలయంగా మార్చుకున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.