సుల్తాన్బజార్ : ఇద్దరు సామాన్యులను చితకబాదిన ఘటనలో నిలదీసినందుకు తనను చంపే స్తానని సినీ నిర్మాత, కాంగ్రెస్ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు తీవ్ర బెదిరింపులకు పాల్పడుతున్నాడని భాధితుడు బొజ్జ భానుచందర్ సోమవారం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో పిటీషన్ ధాఖలు చేశారు.
అనంతరం హెచ్చార్సీ ఆవరణలో భాధితుడు మాట్లాడుతూ కూకట్ పల్లికి చెందిన సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గొట్టి ముక్కల పద్మారావు తన ఫాం హౌజ్లో ఇద్దరు సామాన్యులను తీవ్రంగా కొట్ట డం అన్ని సామాజిక మాద్యమాలలో వైరల్ కావడంతో తాను హెచ్చార్సీలో ఈ ఘటనపై ఫిర్యా దు చేశానని అన్నారు.
అంతే కాకుండా సంగారెడ్డి ఎస్పీకి పద్మారావుపై తగిన చర్యలు తీసుకోవాలని పిటీ షన్ ఇవ్వడం జరిగిందన్నారు. పిటిషన్ ఇచ్చిన కొద్ది రోజులకు పద్మారావు తన అన్నకు ఫోన్ చేసి నీ తమ్ముడి అంతు చూస్తానని బెదిరించాడని అన్నారు.అంతటితో ఆగకుండా తనకు కూడా ఫోన్ చేసి ఎంత ధైర్యం ఉంటే నా మీదే కేసులు పెడతావురా అంటూ తీవ్ర భయబ్రాంతులకు గురి చేశాడని అన్నారు.
బెదిరిం పులకు పాల్పడుతున్న పద్మారావుపై ఆగస్టు-9న భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. అయితే డబ్బుల బలం, రాజకీయ అండతో ఆ పోలీస్ స్టేషన్లో కేస్ బుక్ కాకుండా చేశాడని వాపోయారు. తనను చంపుతానని తీవ్ర బెదిరిస్తున్న గొట్టి ముక్కల పద్మారావుపై తగిన చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించడం జరిగిందన్నారు.