మాదన్నపేట, జనవరి 2 : ఫేస్బుక్లో హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై మాదన్నపేట పోలీస్స్టేషన్లో సోమవారం దళిత సంఘాలు, హిందూ సంఘాల సభ్యులు ఫిర్యాదు చేశారు. మాదన్నపేటకు చెందిన రత్నాకర్రావు ఇటీవల బైరి నరేశ్కు మద్దతు పలుకుతూ హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని, అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇన్స్పెక్టర్ జానయ్యకు ఫిర్యాదు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్న రత్నాకర్పై వెంటనే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని జాతీయ కౌన్సిల్ సభ్యులు సహదేవ్ యాదవ్ కోరారు. రాష్ట్ర దళిత నాయకులు రాజేశ్, నిరంజన్ యాదవ్, ఉగాది మహేశ్, శ్రీకాంత్రెడ్డి, శ్రీనాథ్, ఉగాది మహేశ్, లల్లా జనపాల అజయ్, గౌతం, మధు తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.