సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. బుధవారం నాంపల్లి నియోజకవర్గంలో ఆఘాపూర్ నాలా కల్వర్టు, మల్లేపల్లి మహమూద్ హాస్పిటల్ వద్ద నాలా, తాజ్ నగర్, జీబ్రా డ్రైన్ నాలా పనులను నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్తో కలిసి పరిశీలించారు.
మహమూద్ దవాఖానా వద్ద నాలా నిర్మాణంతో బస్తీవాసులు ఇబ్బంది పడుతారని అధికారులు చెప్పడంతో అలైన్మెంట్ మార్పునకు ఆదేశాలు ఇచ్చారు. బుల్కాపూర్ నాలా పనుల్లో ఆస్తులు కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించి రిటర్నింగ్ వాల్ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రె, ఎస్ఈ రత్నాకర్, ఎస్ఎన్డీపీ కిషన్, ఈఈ లాల్సింగ్ తదితరులు పాల్గొన్నారు.