GHMC | సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి ఉంటుందని కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు.
ప్రజావాణి సందర్భంగా హెడ్ ఆఫీస్లో ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ 040-2322 2182 నంబర్కు తమ సమస్యలను తెలుపాలన్నారు. ప్రజల నుంచి విన్నపాలను స్వీకరిస్తామన్నారు. ఈ ప్రజావాణి జోనల్, సర్కిల్ కార్యాలయాల్లో కూడా ఉంటుందన్నారు.