మేడ్చల్, మే2(నమస్తే తెలంగాణ) : పారదర్శకంగా ర్యాండమైజేషన్ పక్రియ పూర్తి చేశామని మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు.
ఈవీఎం యంత్రాల ర్యాండమైజేషన్ పక్రియ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డీఆర్వో హరిప్రియ, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.