మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 6 : టీఎస్పీఎస్సీ గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, గ్రూప్ -1 పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 11న ఆదివారం జరిగే గ్రూప్ -1 పరీక్షకు 49,660 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారని, అందుకు 101 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, ఏవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు, కమిషనర్లు, రెవెన్యూ, పోలీస్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.