మాదన్నపేట, జనవరి 30: విద్యుత్ చార్జీలు వసూలు చేసేందుకు వెళ్లిన బిల్ కలెక్టర్పై ఓ కార్పొరేటర్ కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ ఘటన మాదన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్న ఉద్యోగి రజినీష్ బాబుపై కుర్మాగూడ కార్పొరేటర్ మహాపారా సోదరుడు షరాఫత్, ఓ అడ్వకేట్, మరో నలుగురు కలిసి దాడి చేశారు. కార్పొరేటర్ ఇంటి విద్యుత్ బిల్లు దాదాపు ఏడాది కాలంగా చెల్లించడంలేదు. ఈ బిల్లు వసూలు కోసం బిల్ కలెక్టర్ వెళ్లగా.. దాడి చేశారు. బిల్ కలెక్టర్కు గాయాలు కావడంతో స్థానిక దవాఖానకు తరలించారు. ఈ దాడిపై సీఐటీయూ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.