ఉప్పల్, నవంబర్ 8 : సీఎం రిలీఫ్ ఫండ్తో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఆసరాగా ఉంటుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే నివాసంలోని కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్ఫండ్ నుంచి మంజూరు చేసిన చెక్కులను అందజేశారు. రజనీకి రూ.60వేలు, పర్వతాలు రూ.60వేలు, రేఖ రూ.60వేలు, నవనీత రూ.30వేలు, నిజాముద్దీన్ రూ.24వేల చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా వారి కుటుంబసభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజా సంక్షేమానికి అధిక నిధులు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా ఎంతో మందికి సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నేతలు జనంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గరిక సుధాకర్, డాక్టర్ బీవీ.చారి, మస్క సుధాకర్, జేసీబీ.రాజు, సూరం శంకర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన మునుగోడు నేతలు
మునుగోడు చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నేతలు మంగళవారం ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డిని కలిశారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం కోసం కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 7, 8 వార్డుల ఇన్చార్జిగా ప్రచారం నిర్వహించి, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను సమన్వయంతో ముందుకు తీసుకువెళ్లి ప్రతిపక్షాలకు బుద్ధిచెప్పేవిధంగా ఓట్లు సాధించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కోసం ప్రతిఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేశారని, పార్టీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో గండెబోయిన వెంకటేశ్యాదవ్, సుక్క యాదయ్య, మాజీ సర్పంచ్ బాలరాజు, శంకర్, శ్రీశైలం, సతీశ్యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్ భగాయత్వాసులకు పర్మినెంట్ ఇంటి నంబర్లు
రామంతాపూర్ భగాయత్ వాసులకు పర్మినెంట్ ఇంటి నంబర్లు ఇస్తామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు అధికారులతో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ అరుణకుమారితో కలిసి చర్చించారు. రామంతాపూర్ భగాయత్ డినోటిఫికేషన్ అయినందున సాయికృష్ణానగర్, బాలకృష్ణానగర్, వెంకటసాయినగర్, కుర్మానగర్, సత్యనగర్, లక్ష్మీనారాయణకాలనీ, అన్నపూర్ణాకాలనీలకు ఇంటి నంబర్లు ఇవ్వాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. సెల్ప్ అసెస్మెంట్ మీసేవలో చేసుకున్నవారికి పర్మినెంట్ ఇంటి నంబర్లు ఇస్తామని అధికారులు తెలిపారు. ఇంటి డాక్యుమెంట్స్తో మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టాక్స్ఇన్స్పెక్టర్ ఏఎంసీ రాజు, టీఆర్ఎస్ నాయకులు జనుంపల్లి వెంకటేశ్వరెడ్డి, గరిక సుధాకర్, జేసీబీరాజు, సూరంశంకర్, కాలనీవాసులు మహేశ్వర్రెడ్డి, నిరంజన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.