వనస్థలిపురం, ఆగస్టు 11 : ఆపదలో ఆదుకునే సీఎం సహాయనిధితో ఎంతో మంది పేదలకు వరంలా మారిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. వనస్థలిపురం క్రిస్టియన్ కాలనీకి చెందిన గడల రాజు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ దవాఖానలో చేరాడు. వైద్యానికి ఎక్కువ ఖర్చు అవుతుండడంతో ఎమ్మెల్యే సిఫారసుతో సీఎంఆర్ఎఫ్కు ధరఖాస్తు చేసుకున్నాడు.
ఆయనకు రూ.46వేలు మంజూరయ్యాయి. ఆ చెక్కును ఎమ్మెల్యే బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కరానాతో ఇప్పటికే ఎంతో నష్టపోయామన్నారు. ప్రజారోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు. కార్పొరేట్ దవాఖానలకు ధీటుగా ప్రభుత్వ దవాఖానలను అభివృద్ధి చేస్తున్నామన్నరు. కార్యక్రమంలో టీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, నవీద్ తదితరులు పాల్గొన్నారు.