గోల్నాక, ఆగస్టు 17 : అనారోగ్యానికి గురై పలు దవాఖానాల్లో చికిత్స పొందుతున్న అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని అంబర్పేట ఎమ్మెలే కాలేరు వెంకటేశ్ అన్నారు. మంగళవారం గోల్నాకలోని ఆయన క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాలేయ సంబంధిత వ్యాధితో భాదపడుతూ నిమ్స్ దవాఖానాలో చికిత్న పొంతుతున్న అంబర్పేట మల్లికార్జుననగర్కు చెందిన కె.అమరేందర్కు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన రూ.5లక్షల విలువగల ఆమోద పత్రాన్ని బాధితుడి కుటుంబసభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు అండగా నిలుస్తుందన్నారు. అర్హులందరికి సీఎంఆర్ఎఫ్ నిధులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో
టీఆర్ఎస్ నాయకులు లవంగు ఆంజనేయులు, సిద్ధార్థ్ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.