హైదరాబాద్ : ప్రైవేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇటీవల జరిగిన బోనాల ఉత్సవాల నిర్వహణకు గాను 81 దేవాలయాలకు 21 లక్షల రూపాయలచెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత విశ్వవ్యాప్తంగా ఈ పండుగను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు.
మన సంస్కృతిని చాటిచెప్పే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 47 మంది లబ్ధిదారులకు 22 లక్షల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.