మన్సూరాబాద్, ఆగస్టు 30 : సీఎం సహాయనిధి ద్వారా ఎంతో మంది పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి సీఆర్ ఎన్క్లేవ్ కాలనీకి చెందిన అంజయ్య రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందాడు.
చికిత్స ఖర్చును భరించలేని స్థితిలో ఉన్న కుటుంబసభ్యులు విషయాన్ని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సీఎం సహాయనిధి ద్వార రూ. 41, 500 వేలను మంజూరు చేయించి సోమవారం సదరు చెక్కును బాధితుడు అంజయ్యకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యాలు, ప్రమాదాల బారినపడిన పేద ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం సహయనిధి ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పేద ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న పథకాలను ప్రతి కుటుంబానికి సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రుద్ర యాదగిరి, యాదవచారి తదితరులు పాల్గొన్నారు.