CM Revanth Reddy | మూసీ నది పరీవాహక ప్రాంతం అభివృద్ధిపై నానక్రామ్గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్తో పాటు పలు వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. మూసీ అభివృద్ధిపై వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఇందుకు ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న చెప్పారు. అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.