మైలార్దేవ్పల్లి : పేదల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ఆసరాగా నిలుస్తున్నదని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్ అన్నారు. బుధవారం తన నివాసంలో బృందావన్ కాలనీకి చెందిన సదానందం కు లక్షాయాబై వేల చెక్కును అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..పేదల బ్రతుకుల్లో వెలుగు నింపడమే లక్ష్యంగా సీయం కేసీఆర్ పని చేస్తున్నారని పేర్కొన్నారు.
సీయం రిలీఫ్ ఫండ్ ప్రతి నిత్యం ఎంతో మందికి ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు రాఘవేందర్ యాదవ్ , సామల సత్యం, రాజేష్ తిదతరులు ఉన్నారు.