ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 8: అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకోలేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మేలు చేస్తుందని డిప్యూ టీ మేయర్ మోతె శ్రీలత అన్నారు. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో రాష్ట్ర ప్రజలకు నేనున్నాననే భరోసా కలిపిస్తూ వారికి వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా సీఎంఆర్ఎఫ్ అందజేస్తున్నారన్నారు. తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులు పరమేశ్వర్, కృష్ణారెడ్డిలకు బుధవారం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు మోతె శోభన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు అంజి, బాబు తదితరులు పాల్గొన్నారు.