కవాడిగూడ, జనవరి 16: సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఆదివారం భోలక్పూర్ డివిజన్లోని అంజుమన్ భవన్లో ఆరుగురు లబ్ధిదారులు రూ.1.49 లక్షల విలువజేసే సీఎం రీలీఫ్ఫండ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, షరీఫుద్దీన్, సబీల్, రహీం, చాంద్, ఎ.శంకర్ గౌడ్, మహ్మద్ అలీ, శ్రావణ్కుమార్, జబ్బార్, మహేశ్, దస్తగిరి, అఫ్రోజ్, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు.
హైటెన్షన్ వైర్లను తొలగించేందుకు చర్యలు
హైటెన్షన్ వైర్లను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. కవాడిగూడలోని స్పిన్నింగ్ మిల్స్ బస్తీలో ఇంటిపై బట్టలు ఆరేస్తున్న ఓ వ్యక్తికి హైటెన్షన్ వైర్లు తగిలి విద్యుత్ షాక్కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడటంతో ఆ వ్యక్తిని స్థానికులు గాంధీ దవాఖానకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ నగర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ జరిగిన పరిస్థితిని తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హైటెన్షన్ వైర్లు తొలగించి కేబుల్ వైర్లు అమర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. బస్తీవాసులు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు జమాలొద్దీన్, దిశ కమిటీ సభ్యుడు జి.వెంకటేశ్, బస్తీ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.జంగయ్య, శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ జమాలొద్దీన్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చర్చి నిర్మాణ పనులు ప్రారంభం
రాంనగర్ ప్రేయర్ పవర్ చర్చి ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన నూతన చర్చి భవన నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రత్యేక పథకాలను అమలు చేస్తూ మైనారిటీలు ఆర్థికంగా ఎదగడానికి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్రావు, ప్రేయర్ పవర్ చర్చి ప్రతినిధులు శ్యామ్ అబ్రహం, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, ఆర్.మోజస్ తదితరులు పాల్గొన్నారు.