మహేశ్వరం: సీఎం రిలీఫ్ఫండ్ పేదలకు ఆసరాలాంటిదని రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాలకు చెందిన రమేష్కు సీఎం రిలీఫ్ఫండ్ 60వేల రూపాయల చెక్కును రావిర్యాలలో మంత్రి చేతుల మీదుగా అందజేశారు.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సీఎం రిలీఫ్ఫండ్ చెక్కును తెలంగాణ ప్రభుత్వం అందజేస్తుందని ఆమె అన్నారు.ఈకార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధుమోహన్,వైస్ చైర్మన్ భవానివెంకట్రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు.