బంజారాహిల్స్ : అనారోగ్యంతో బాధపడుతున్న షేక్పేట డివిజన్కు చెందిన హీరాబాయి అనే మహిళ చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరయిన రూ.2.75లక్షల ఎల్వోసీ పత్రాన్ని మంగళవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు.
పేదరికంతో బాధపడుతున్న వారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తితే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని, అలాంటివారిని ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ఫండ్ కింద ప్రభుత్వ సాయం అందిస్తున్నామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు దుర్గం ప్రదీప్కుమార్ తదితరులు పాల్గొన్నారు.