శంషాబాద్ రూరల్, నవంబర్ 26 : పేదలకు ఆరోగ్య సంజీవనిగా సీఎం సహాయనిధి ఆదుకుంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని నర్కూడకు చెందిన పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్కూడకు చెందిన గుండాల పుష్పలతకు రూ. 43వేల 500లు, ఎలగల సిద్ధులుకు రూ.60వేల చెక్కులను అందజేశామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం సహాయనిధి పేదలకు వరంగా మారిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తూ ఆదుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు నీరటి రాజుముదిరాజ్, డీసీసీబీ డైరెక్టర్ సతీశ్, మాజీ ఎంపీటీసీ మోహన్నాయక్, గ్రామ కమిటీ అధ్యక్షుడు నీరటి శేఖర్ ముదిరాజ్, నాయకులు చందన్వెళ్లి శ్రీనివాస్, గుండాల విశ్వనాథ్,అశోక్, రాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
శంషాబాద్లో..
పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. శుక్రవారం శంషాబాద్కు చెందిన బాధితుడు రఘురాంరెడ్డికి రూ.56 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్, వైస్ చైర్మన్ గోపాల్ పాల్గొన్నారు.
మైనార్టీలకు పెద్దపీట..
వ్యవసాయ యూనివర్సిటీ : సీఎం కేసీఆర్ మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శుక్రవారం టీఆర్ఎస్ కార్యాలయంలో సులేమాన్ నగర్కు చెందిన హుస్సేన్ఖాన్ , అబ్దుల్ రహీం కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.