కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
మేడ్చల్ రూరల్, మే 29 : ప్రజా సంక్షేమంలో తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మండల పరిధిలోని గౌడవెల్లి గ్రామానికి చెందిన బాలరాజుకు సీఎం సహాయనిధి నుంచి రూ.60 వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును ఆదివారం మంత్రి తన కార్యాలయంలో లబ్ధిదారుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. సీఎం సహాయనిధి, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి నిరుపేదల పాలిట వరంగా మారాయన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా సీఎం సంక్షేమ పథకాలను కొనసాగించారని తెలిపారు. సీఎం సహాయనిధితో పేదలు కార్పొరేట్ వైద్యాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగన్ రెడ్డి, నాయకులు సింహాల్ యాదవ్, గోమారం శ్రీనివాస్రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, ధన్రాజ్ నాయక్ పాల్గొన్నారు.
బోడుప్పల్కు చెందిన ఒకరికి..
బోడుప్పల్ కార్పొరేషన్ 23వ డివిజన్ పరిధి….కమలానగర్కు చెందిన ఎస్ బాలకృష్ణ సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా రూ.45వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును లబ్ధిదారుడికి కార్పొరేటర్ వెంకటేశ్యాదవ్ ఆదివారం అందజేశారు. టీఆర్ఎస్ నాయకులు లోకేశ్, రాంచందర్, మల్లేశ్ పాల్గొన్నారు.
ఘట్కేసర్ రూరల్, మే 29 : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. కొర్రెముల పంచాయతీ బాలాజీనగర్ కాలనీకి చెందిన టి. నరసింహా రావుకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.27,500 చెక్కు మంజూరైంది. ఈ చెక్కును ఆదివారం ఆయన నివాసంలో లబ్ధిదారుడికి మంత్రి అందజేశారు. కార్యక్రమంలో కొర్రెముల మాజీ సర్పంచ్ నాగరాజు, ఎదులాబాద్ మాజీ సర్పంచ్ మూసీ శంకర్, మహారాజ్ పాల్గొన్నారు.