మియాపూర్, ఫిబ్రవరి 13 : కంటి సమస్యల నివారణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ బృహత్తరమైన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజల కోసం నిర్వహిస్తున్నారని విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఈ కేంద్రాన్ని వినియోగించుకుని కంటి సమస్యలను నివారించుకోవచ్చునని పేర్కొన్నారు. వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్ కాలనీ సగరసంఘం కమ్యూనిటీహాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు కేంద్రాన్ని కార్పొరేటర్ రోజాదేవితో కలిసి విప్ గాంధీ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 12 కేంద్రాలలో ఉచితంగా కంటి వైద్య పరీక్షలను నిర్వహిస్తూ అవసరమైన వారికి కండ్ల జోడును అందిస్తున్నట్లు తెలిపారు.
పౌష్టికాహారం, ఇతర అనారోగ్య సమస్యల వల్ల చూపు మందగించే అవకాశం ఉన్నందున కంటి వెలుగు కేంద్రాలలో ఉచితంగా పరీక్షలను పొంది చూపును మరింత మెరుగు పరుచుకోవాలని ఆయన సూచించారు. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని దేశంలోని ఏరాష్ట్రంలోనూ ఈ తరహా సేవలు లేవన్నారు. వంద రోజుల పాటు కొనసాగే కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రంగారావు, సంజీవరెడ్డి, భాస్కర్రావు, చంద్రకాంత్రావు, హరినాథ్, ఆంజనేయులు, దయాసాగర్, మోహన్రావు, వెంకటస్వామి, విద్యాసాగర్, తదితరులు పాల్గొన్నారు.