కాచిగూడ, మార్చి 17: కంటి సమస్యలు లేని తెలంగాణే ధ్యేయంగా.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ ఏడాది జనవరి 19వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా కాచిగూడ డివిజన్లో లింగంపల్లి సీఐబీ క్వార్టర్స్లోని కమ్యూనిటీ హాల్, కాచిగూడ బద్రుక కళాశాలలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కేంద్రంలో ఉదయం 9 గంల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్తిస్థాయిలో సిబ్బంది అందుబాటులో ఉండడంతో అక్కడికి వచ్చే ప్రజలకు కొన్ని నిమిషాల్లోనే కంటి పరీక్షలు చేయించుకొని ఇంటికి సంతోషంగా వెళ్తున్నారు.
కార్పొరేటర్లు, వార్డు సభ్యులు, ప్రొఫెసర్లు, ఉన్నత వర్గాలతోపాటు కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడి వచ్చి కంటి పరీక్షలు చేయించు కుంటున్నారు. ప్రజలకు మొదట కంటి పరీక్షలు చేసి అనంతరం ఉచితంగా మందులు, కళ్లద్దాలను పంపిణీ చేసి, అవసరమైన వారికి కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి సంబంధిత దవాఖానలకు పంపించడం గొప్ప విషయమని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేంద్రానికి డివిజన్లోని విక్రమ్నగర్, వీరన్నగుట్ట, చప్పల్బజార్, నింబోలిఅడ్డా, మోతీమార్కెట్, లింగంపల్లి, బర్కత్పుర, భూమన్నగల్లీ, మేదర్బస్తీ, నారాయణగూడ తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. అదే విధంగా మహిళలు డివిజన్లోని పలు బస్తీలు, కాలనీలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోవాలని ప్రచారం చేయడం చాలా గొప్ప విషయమని, జనవరి 19వ తేదీ నుంచి మార్చి 17 వరకు 57 రోజుల్లో దాదాపు 3,710 మంది ప్రజలు కంటి పరీక్షలు చేయించుకున్నారని కాచిగూడ డివిజన్ కంటి వెలుగు ఇన్చార్జి డాక్టర్ మనోజ్రెడ్డి తెలిపారు.
పేద ప్రజల అదృష్టం..
అన్ని వర్గాల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ప్రభుత్వం కంటి వెలుగును పె ట్టడం పేద ప్రజల అదృష్టం. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇ లాంటి ఆలోచన చేయలేదు. కంటి వె లుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. మా కుటుంబ సభ్యులందరం ఇక్కడే కంటి పరీక్షలు చేయించుకొని, కళ్లద్దాలను తీసుకున్నాం.
–గోనె ప్రదీప్రావు (తిలక్నగర్)
మాలాంటి పేదలకు వరం
కంటి వెలుగు కా ర్యక్రమం పేద, మధ్యతరగతి ప్రజలకు దేవుడిచ్చిన వరం. భా ర్యభర్తలిద్దరం ఇక్కడికి వచ్చి కంటి పరీక్షలు చేయించుకొని కళ్ల జోడును తీసుకున్నాం. గతంలో ఏ ముఖ్యమంత్రి పేద ప్రజల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. ప్రైవేటు దవాఖానలో పరీక్షలు, కళ్లద్దాలకు వేల రూపాయల వరకు ఖర్చు అవుతాయని, ఇక్కడ ఉచితంగ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది.
– బి.అంజమ్మ (చెప్పల్బజార్)