మల్లాపూర్, ఫిబ్రవరి 15 : బంజారాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి అ న్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని సింగం చెరువుతండాలో పీరూనాయక్ ఆధ్వ ర్యంలో నిర్వహించిన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు ఆయన ,ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకుడు, బీఎల్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బండారి లక్ష్మారెడ్డితో కలిసి హాజరైయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రం లోని తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి బంజారాలకు ఎంతో మేలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో గిరిజన విద్యార్థులు దేశానికి కీర్తి తెచ్చే దిశగా ఎదగడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వాసుదేవ్గౌడ్, కుంటి కృష్ణ, భాస్కర్, పీఆర్ ప్రవీణ్, శ్రావణ్, రఘు, జీకే రమేశ్, సింగం చెరువు తండా ప్రతి నిధులు శంకర్నాయక్, లింగ నాయక్, ఆనంద్ నాయక్, రమణ, శ్రీనివాస్యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
ఉప్పల్, ఫిబ్రవరి 15 : శ్రీతుల్జా భవానీ లంబాడీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొర్ర కృష్ణానాయక్ ఆధ్వర్యంలో చిలుకానగర్ చౌరస్తాలో బుధవారం సేవాలాల్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోనె శ్రీకాంత్ ముదిరాజ్, గజ్జెల సత్య రాజ్, పలువురు నేతలు హాజరైనారు. ఈ సందర్భంగా సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సకినాల ప్రసాద్, పలుగుల యాదగిరి, రవ్య అశోక్, నాగు సత్యనారాయణ, రాజు, అమర్సింగ్, నవీన్, విఠల్, సందీప్ పాల్గొన్నారు.