సిటీబ్యూరో, జూన్ 26 (నమస్తే తెలంగాణ) :రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన్నె క్రిశాంక్ తన పుట్టినరోజును పురస్కరించుకొని సోమవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.