కుత్బుల్లాపూర్/జీడిమెట్ల/జగద్గిరిగుట్ట, అక్టోబర్ 5: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ స్వరాష్ట్రం కోసం కొట్లాడుతుంటే ఢిల్లీలో అప్పటి ఆంధ్రపాలకులు తమ ఆందోళనలను చూసి హేళన చేశారు.. కానీ ఎంతో మంది బలిదానాలు..మరెన్నో పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుంటే అదే ఆంధ్రపాలకులు శభాష్ చెప్పుకోవడం యావత్ తెలంగాణకే గర్వకారణమని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు.
గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ గ్రామంలో డబుల్ బెడ్రూంల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానం ద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శంభీపూర్రాజుతో కలిసి ఆయన కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సనత్నగర్, కంటోన్మెంట్(సికింద్రాబాద్) నియోజకవర్గాలకు చెందిన 2,550 మంది లబ్ధిదారులైన కుటుంబాలకు ఇండ్ల పట్టాలను అందించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి గోల్డెన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్కే సాధ్యమైందన్నారు. అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేక పూట కో వేషంతో జిమ్మిక్కు రాజకీయాలకు తెరలేపుతున్నారన్నారు. ఎవరెన్నీ కుట్రలు పన్నినా…సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులకు, తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు తెలుస్తుందన్నారు. నగరంలో లక్ష ఇండ్లను కట్టి పేదలకు పంచుతామని ఆనాడు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నేడు నిలబెట్టుకొని బడుగు, బలహీనవర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందించి తీరామన్నారు. ఇది ఇప్పటితోనే ఆగిపోలేదని, ఇది నిరంతరాయంగా కొనసాగే ప్రక్రియ అని, అర్హులైన ప్రతి కుటుంబానికి రెండు పడకల ఇంటిని అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రజా సంక్షేమం , అభివృద్ధి జరుగు తుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నగరంలో లక్ష పడకల ఇండ్లను పూర్తి చేయ గా.. ప్రస్తుతం 70 వేల ఇండ్లను ఇప్పటి వరకు లబ్ధిదారులకు పంపిణీ చేశామని, మరో 30 వేల ఇండ్లను త్వరితగతిన పంపిణీకి సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో దాదాపుగా 12వేల ఇండ్ల ని ర్మాణం జరిగిందని, వీటిలో ఇప్పటికే 9 వేల ఇండ్లు పూర్తి చేసుకొని అర్హులైన లబ్ధిదారులకు అందించగా.. మరో 3 వేల ఇండ్లు పంపిణీకి సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
రెండు పడకల ఇండ్ల నిర్మాణ పథకం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్రాజు అన్నారు. పేద ప్రజలందరికి సంక్షేమ పథకాలను అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేందాలని ఆశించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డి, ఆర్డీఓ శ్యాంప్రసాద్, జోనల్ కమిషనర్ మమత, నిజాంపేట్ మేయర్ కొలన్ నీలాగోపాల్రెడ్డి, కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, కొలుకుల జగన్, రావుల శేషగిరిరావు, పార్టీ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు దూదిమెట్ల సోమేశ్యాదవ్, పార్టీ సీనియర్ నేత సంపత్ మాధవరెడ్డి, గుమ్మడి మధుసూదన్రాజు, తోకల నగేశ్రెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, అధికారు లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.